అన్నమాచార్యులు
215.
మూడేమాటలు మూడుమూండ్లు తొమ్మిది
ఈ కీర్తనలో వేదాంత రహస్యము ముఖ్యంగా ప్రస్తావించ బడినది. వేదాంతము అనే పదానికి '(ఇహ సంబంధమైన) జ్ఞానమునకు ముగింపు' అని అర్థం. వేదము ప్రాధాన్యంగా భక్తి, జ్ఞానం, మరియు విముక్తిపై దృష్టి పెడుతుంది. వేదాంతం అనేక సంప్రదాయాలుగా అభివృద్ధి చెందింది, వీటిపై వివరణలను ప్రస్థానత్రయీ అని పిలువబడే ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు మరియు భగవద్గీత అను గ్రంథాల నుండి పొందవచ్చును.
అయితే, ఎన్ని గ్రంధాలు చదవండి, ఎంత మంది చెప్పిన వివరణలను వినండి, వేదాంత రహస్యముపై ఎంతో కొంత అనుమానం మిగిలిపోతూనే ఉంటుంది. ఇదే మానవునికి ప్రాథమికమైన సమస్య. వేదాంతమునకు ఇదే చివరిమాట అనినొక్కి చెప్పలేము.
అందుకనే అన్నమాచార్యులు “ఇన్నియుఁ జదువనేల యింతా వెదకనేల / కన్ను దెరచుటొకటి కనుమూయుటొకటే” అని ప్రశ్నించారు. ఈ శాస్త్రములు / వేదములు) ఇన్నియుఁ జదువనేల? యింతటా (దైవమును) వెదకనేల? కనులు తెరచుటలోను కనులు మూయుటలోను బేధమున్నదా? (లేదు). జననం, మరణం రెండే రెండు పరమ వాస్తవాలు. అనివార్యమైన ఈ అవధుల మధ్యకాలమును సిద్ధాంతాలతోను, వెదుకుటలోనూ వృథా చేయవద్దు. మానవులారా! మీ ఇప్పటి అవగాహనలను ప్రక్కన బెట్టి, ఎదురుగా వున్న ఈ ప్రపంచమును (అందులోనే వున్న హరిని) కనుగొనుడీ! అని ఉద్భోదించారు.
అన్నమాచార్యులవారు కైవల్యపదమును చేరుకొన్నారను విషయమును అనేక కీర్తనలనుండి తెలియవచ్చును. అట్టి ఉత్కృష్ట స్థితికి చేరిన మహానుభావులు న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః అన్న భగవద్గీత వాక్యమును తమ నిజ జీవితంలో అనుసరించువారై ఉందురు. అనగావారు ఏ సిద్ధాంతములను, జీవులను ఆలంబనగా చేసుకుని జీవించరు. ఇదే విషయమును జిడ్డు కృష్ణమూర్తి జీవిత చరిత్రను పరిశీలించి తెలుసుకొనవచ్చును.
అందుకని ఈ కీర్తనను కొంత తర్కంతోను కొంత అనుభవంతోను, కొన్ని నిజ జీవితపు సంఘటనలను కలుపుతూ
చర్చించుకుందాం.
కీర్తన సంగ్రహ భావము:
పల్లవి: మానవులారా మీ మనసు భవిష్యత్తుపై 3 నుంచి
9 (ఆపై 27) లాగా అంచనాలు పెంచుకుంటూ పరిగెడుతూనే ఉంటుంది. (అది
ఆగదు). అయ్యలారా ఆ శ్రీహరిని వేడుకొని ఆ వేదాంత రహస్యము తెలిసి
తరించండి.
మొదటి చరణం: మానవులారా జీవస్వరూపముపై మంథన
చేసి మీలో ఉన్న జీవమే అంతటాను వ్యాపించి ఉన్నదని
గ్రహించి, అదియే దేవుని వైభవము అని అంతరంగములో నిలుపండి. పుంఖానుపుంఖంగా
సాగుతున్న సృష్టి సర్వవ్యాపియైన భగవంతుని మహిమే - ఈ తరగని ప్రకృతి సంపద. అదియే వేదాంత రహస్యము. అంతరార్థము: జీవస్వరూపాన్ని నిజంగా
తెలుసుకోవాలంటే మనం ఏమి చేయాలి? ప్రపంచాన్ని, మనల్ని విభజిస్తున్న భ్రమలను తొలగించి, జీవమును యథార్థంగా
అనుభవించగలిగితే – అప్పుడే జీవితం సమగ్రమవుతుంది. అదే వేదాంత రహస్యము.
రెండవ చరణం: అప్పుడు మీరు మీలో లోకానుభవమువలనఁగలిగిన
తెలివిని తెలుసుకుంటూ, అదే పనిగా అది జీవము కాని విషయమని, జీవమునకు సంబంధించని దని తలపోసి దైవమును నమ్మి అలాగే వుండండి. వైరాగ్యముగా అంటే “అది మనంతటకు
మనము ప్రక్కకు త్రోసి వేయగలిగిన విషయం కాదు” అన్నదే వినవలసినటువంటి వేదాంత రహస్యము.
మూడవ చరణం: ఇదమిత్థముగా నిర్ణయించలేని
శరణాగతి యొక్కటే ఉపాయముగా భగవంతునిపై పూర్తి విశ్వాసముతో అనంతమగు సత్యము నందు బేషరతుగా
(వేరొక ఉపాయమును అలోచించక) కలసిపోవుటయే బ్రహ్మానంద వేదాంత రహస్యము.
కీర్తన
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 370-3 సంపుటము: 4-412
చరణం
1
చరణం
2
చరణం 3
Details
and explanation:
భావము: మానవులారా మీ మనసు భవిష్యత్తుపై 3 నుంచి 9 (ఆపై 27) లాగా అంచనాలు పెంచుకుంటూ పరిగెడుతూనే ఉంటుంది. (అది ఆగదు). అయ్యలారా ఆ శ్రీహరిని వేడుకొని ఆ వేదాంత రహస్యము తెలిసి తరించండి.
వివరణ:
మనస్సు అత్యంత సారవంతమైన భూమి. అందులో ఏ బీజాన్ని నాటినా మొలకెత్తుతుంది. మన ఆలోచనలే ఆ బీజాలు.
మానవుల మనసు ఎప్పుడు
భవిష్యత్తుపై ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటుంది. ఈ
ఆలోచనలు 3, 9, 27 లాంటి గుణశ్రేఢిలో విస్తరిస్తూ ముందుకు
దూసుకెళ్తాయి,
కానీ మన చేతలు 1, 2, 3 లాంటి అంకశ్రేఢిలో నెమ్మదిగా సాగుతాయి.
దీని ఫలితంగా, మన ఊహలు వాస్తవం కంటే ముందుకు పరుగెడుతూనే ఉంటాయి. ఈ వ్యత్యాసమే అసంతృప్తికి మూలం.
అలా అసంతృప్తి చెందిన వ్యక్తుల సమూహమే నేటి సమాజం.ఈ సమాజంలో నెలకొన్న అస్తవ్యస్తతకు ప్రతి ఒక్కరి అంతర్గత అశాంతే మూలకారణం.
ఆచార్యులు ఇక్కడ "వేడుకొని చదవమని" ఎందుకు అన్నారు? ఎందుకంటే, మనం ఎంత ప్రయత్నించినా మనస్సు వేరే దిశలో లాక్కుంటూ పోతుంది. అట్టి మనస్సును సంభాళించి, శ్రీహరిని వేడుకొని, ఈ రహస్యాన్ని తెలుసుకోవాలని సూచిస్తున్నారు.
ఇక్కడ వేదాంతరహస్యముతో ఎంత చదివినా ఎంత వినినా అంతుబట్టకపోవడమును సూచించారు
వేదాంత రహస్యాలు ఎంత చదివినా, ఎంత వినినా పూర్తిగా అంతుబట్టకపోవడం సహజం. కావున, గ్రహించేందుకు భక్తి, సాధన, ఆత్మసాక్షాత్కారం అవసరం.
మొదటి చరణం
భావము: మానవులారా జీవస్వరూపముపై మంథన చేసి మీలో ఉన్న జీవమే అంతటాను వ్యాపించి ఉన్నదని గ్రహించి, అదియే దేవుని వైభవము అని అంతరంగములో నిలుపండి. పుంఖానుపుంఖంగా సాగుతున్న సృష్టి సర్వవ్యాపియైన భగవంతుని మహిమే - ఈ తరగని ప్రకృతి సంపద. అదియే వేదాంత రహస్యము.
వివరణము:
జీవస్వరూపము
– మానవుని మౌలిక ప్రశ్న
జీవస్వరూపము అంటే ఏమిటి? మనము నిజంగా జీవిస్తున్నామా? లేక కేవలం శారీరకంగా ఉనికిలో ఉన్నామా? బతికే ఉన్నాం అనడానికి సాక్ష్యం ఏమిటి? జీవస్వరూపమునకు ఇదమిత్థమైన రూపం ఉండదని మీరు గ్రహించే ఉంటారు. భగవానుని అవతారాలు అనేక రూపములలో చూపుటకు ఇదే కారణం.
అన్నమాచార్యులు ఈ పల్లవిలో మన ముందు ఒక ప్రశ్న పెడుతున్నారు: "చాల నొవ్వి సేయునట్టి జన్మమేమి మరణమేమి?" (ఎంతో శ్రమించి చేసే ప్రస్తుత జీవితానికి, మరణానికి వ్యత్యాసమేమి?). మనం చేసే ప్రయత్నాలన్నీ అసలు నిజమైన జీవనానికి దారితీస్తున్నాయా? లేక అవి ఒక భ్రమలో మిగిలిపోతున్నాయా?
మహాభారతంలో భీష్ముల వారి ఉద్బోధ అంతా "ఏకాగ్రత" పైనే. అంటే "దైవముతప్ప వేరువిషయములు లేవు అని మనిషి ఉండవలెను" అన్న విషయం గుర్తుకు తెచ్చుకుందాం.
మనుషులు జీవించలేరా? లేదా జీవించనివారైపోయారా? జిడ్డు కృష్ణమూర్తిగారు ఒక గొప్ప మాట చెప్పారు: "IF YOU ARE NOT IN COMMUNION with anything, you are a dead human being." (నీవు చేస్తున్న దేనితోనైనా నిజమైన అనుబంధం లేకుంటే, నీవు మృతప్రాయుడవు.) మన అనుబంధాలలో ఏకత్వం లేదు. అవి కొంత స్వప్రయోజనాలు కొంత ప్రేమ ఒలకబోస్తూ కలగూరగంపలా ఉంటాయి.
మన భావాలు మన హృదయంలోనే పరిమితమై ఉంటాయి; అవి నేరుగా ఇతరులకు తాకవు. మన అనుభవాలు కూడా మనమే నిర్మించుకున్న ప్రొజెక్షన్లే. అందుకే, మనం నిజంగా జీవిస్తున్నామా? లేకపోతే మన ఉనికే ఒక భ్రమయా?
ప్రపంచం మనకు – మనం ప్రపంచానికి ఎంత దూరం? మనకు ప్రపంచానికి మధ్య ఒక మానసిక దూరం ఉంది. ఈ దూరాన్ని తొలగించేందుకు చేసే ప్రయత్నాలన్నీ కృత్రిమమైనవే. మనస్సును బలవంతంగా మార్చడానికి చేసే అన్ని సాధనలూ విఫలమవుతాయి.
అన్నమాచార్యులు చేరిన స్థితికి చేరుకున్న మహానుభావులందరూ ఈ మానసిక విభజనను తొలగించడానికి ప్రయత్నించారు. వారు తాము మరియు ప్రపంచం మధ్య గల దూరాన్ని చెరిపివేసి, ప్రపంచంతో తాదాత్మ్యాన్ని అనుభవించారు. ప్రపంచంతో అచంచలమైన ఆత్మీయ భావనకు పెద్దపీట వేశారు.
అన్నమాచార్యుల ఆంతర్యం: అన్నమాచార్యుల స్థితి ఏదైనా సిద్ధాంతంతో ముడిపడలేదు. జిడ్డు కృష్ణమూర్తిగారు కూడా ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించలేదు. వారిద్దరు కూడా కేవలం ప్రపంచాన్ని మనకు అద్దంలో చూపించినట్టు చూపించారు.
అన్నమాచార్యులు తనను తాను ప్రకృతి సంపదగాను అనుభవించి, భావించి వ్రాశారు. ఇదే భావాన్ని జిడ్డు కృష్ణమూర్తిగారు కూడా వ్యక్తపరచినట్లు స్పష్టమవుతోంది.
జీవము అనునది నిరంతరమూ సాగు (భగవంతుని) వ్యవసాయం. జీవితము అనునది దేహ సంబంధమైనది. జీవమును పదార్థముతో గూడిన జీవితంతో ముడి పెట్టరాదు అన్నదే వేదాంత రహస్యము.
ఇక్కడ వేదాంతరహస్యముతో సామాన్యజీవులకు
జీవస్వరూపము అంతు బట్టక పోవుటను సూచించారు.
అంతరార్థము: జీవస్వరూపాన్ని నిజంగా
తెలుసుకోవాలంటే మనం ఏమి చేయాలి? ప్రపంచాన్ని, మనల్ని విభజిస్తున్న భ్రమలను తొలగించి, జీవమును యథార్థంగా
అనుభవించగలిగితే – అప్పుడే జీవితం సమగ్రమవుతుంది. అదే వేదాంత రహస్యము.
వివరణము: జీవము అనునది నిరంతరమూ సాగు (భగవంతుని) వ్యవసాయం. జీవితము అనునది దేహ సంబంధమైనది. అది స్వల్పకాలికము. జీవమును పదార్థముతో గూడిన జీవితంతో ముడి పెట్టరాదు అన్నదే వేదాంత రహస్యము.
రెండవ చరణం
ముఖ్యపదములకు అర్ధములు: విజ్ఞానము = లోకానుభవమువలన తెలిసినవి; పనితోడ = అదే పనిగా; మనికిగా =జీవనముగా;
భావము: అప్పుడు మీరు మీలో లోకానుభవమువలనఁగలిగిన
తెలివిని తెలుసుకుంటూ, అదే పనిగా అది జీవము కాని విషయమని, జీవమునకు సంబంధించని దని తలపోసి దైవమును నమ్మి అలాగే వుండండి. వైరాగ్యముగా అంటే “అది మనంతటకు
మనము ప్రక్కకు త్రోసి వేయగలిగిన విషయం కాదు” అన్నదే వినవలసినటువంటి వేదాంత రహస్యము.
వివరణము:
భక్తినిలిపి: బంధములు అని చెప్పినటువంటి విషయము ఇదే. మనిషి తనలో లోకానుభవం వలన కలిగిన విషయములను తెలుసుకొనగలిగినప్పటికీ, ఆ సమయములో తాను ఏదో ఒకటి చేయవలను అను ఉత్కంఠ, ఉద్రేకం అతనిని పక్కదోవ పట్టించును.
భగవద్గీతలో చెప్పిన, కామ ఏష క్రోధ ఏష రజోగుణసముధ్భవః । మహాశనో మహాపాప్మా విధ్ధ్యేనమిహ వైరిణమ్ ॥ 3-37 ॥ మహాశనో = మహా అశనో అనగా ఎంతకు తీరని దాహము. మనిషి జీవము కాని విషయములను తెలుసుకున్నప్పటికీ, రజోగుణం యొక్క ప్రభావముతోను, ఏదో సాధించాలి అన్న కోరికతోనో (కామ ఏష) ఆ క్షణంలో, ఆ సమయంలో భగవంతుని మీద భారం వేసి ఉంచకపోవడంతో తప్పు దారి పడతాడు. భక్తిని నిలపడంలో అసమర్థుడు అవుతాడు.
మనికిగా వైరాగ్యము మరవకుండుట: ఇప్పుడు అన్నమాచార్యులు ఎంత ప్రాక్టికల్గా, ఆచరించదగిన రీతిలో చెబుతున్నారో తెలియండి. వైరాగ్యము మరవకుండుట అంటే మానవుడు (ఏదైనా) కార్యము చేయుటకు ఉద్యుక్తుడైనప్పుడు తాను చెయ్యరాదు (అనగా తాను నిమిత్తమాత్రుడు) అన్న విషయమును ప్రక్కన పెట్టి జీవమును తెలియుటలో ప్రతిక్షణము విఫలమవుతున్నాడు. అంటే జీవము వైరాగ్యము వేరు వేరు విషయములు కావని, జీవమును గుర్తించు శక్తిని పదార్థ సంబంధ శరీరముతో తెలియుట అసాధ్యము. ఆ సమయములో దైవముపై భారము వేసి వుండలేకపోవు మన అశక్తతను ఎత్తి చూపుతున్నారు.
వినవలసిన యట్టి
వేదాంత రహస్యము: విని తెలుసుకోదగిన వేదాంత రహస్యము తనను తాను నిమిత్తమాత్రుడుగా గుర్తించి
ఆప్రకారముగా నడచుట. "విదిత్వా యోగీ పరం స్థా నముపైతి చాద్యమ్ (8-28)"
అన్న భగవద్గీత వాక్యము కూడా దీనినే సూచించుచున్నది.
మూడవ చరణం:
ముఖ్యపదములకు
అర్ధములు: ఆచార్య విశ్వాసము: భగవంతునిపై విశ్వాసము; జాడల
శరణాగతి = ఇదమిత్థముగా నిర్ణయించలేని శరణాగతి; సాధనము = ఒకే ఉపాయముగా;
కూడి శ్రీవేంకటేశుగొలిచి దాసుడౌటే = విశ్వాసముతో కూడి ఆ చెప్పలేని అనంతములో
కలిసి శ్రీవేంకటేశు దాసుడగుట.
భావము: ఇదమిత్థముగా నిర్ణయించలేని
శరణాగతి యొక్కటే ఉపాయముగా భగవంతునిపై పూర్తి విశ్వాసముతో అనంతమగు సత్యము నందు బేషరతుగా
(వేరొక ఉపాయమును అలోచించక) కలసిపోవుటయే బ్రహ్మానంద వేదాంత రహస్యము.
వివరణము:
అన్నమాచార్యులవారు అత్యంత ఆచరణయుక్తముగా వేదాంత రహస్యములను వెల్లడించనున్నారు.
జాడల శరణాగతి అని చెప్పి అది మానవుడు సులభముగా తన ఇంటిలో విద్యుద్దీపముల మీటలు నొక్కినట్టు (=స్విచ్ వేసినట్టుగా) తెలియలేడు. ఉదాహరణకు క్రింది ఒక కీర్తనలోని చరణమును చూడండి.
ముఖ్యపదములకు అర్ధములు: తివిరి = ఆలోచించి, ప్రయత్నపూర్వకముగా, త్వరపడి; అల్లునేరే ళ్లింతే = నమస్కారములు కూడా అంతే.
భావము: వెన్నెలలో మనం చేసే నమస్కారాలు ఇతరులకు ఎంత అస్పష్టంగా కనిపిస్తాయో, అదేవిధంగా మానవుడు తన పాప–పుణ్య సంబంధాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం కూడా అంతే గూఢమైన విషయం. కానీ, అతడు ఈ గందరగోళపు లోకంలోనే తచ్చాడుతూ, నిజమైన జ్ఞానాన్ని తెలుసుకొనవలెను. రూడి యగు నిన్నటి అనుభవాలు అను భూతకాలము లోని వానితో పోల్చితే నేడు అను సంగ్దిద్ధము నుండి నేర్చుట కష్టమే, కాని అదియే చేయవలసిన కార్యము.
వీడని
బ్రహ్మానంద వేదాంత రహస్యము అనగా ఇది ఏకపక్ష మార్గము
ఒక్కసారి దానిలోకి వెళితే తిరిగి వచ్చుటకు ఆస్కారం లేదు. ఆ బ్రహ్మానందంలో
మునిగినవారు తాము అనుభవించినవి ఈ భూలోకంలో వారికి చెప్పుటకు అవకాశం లేదు. వారు బ్రహ్మానందం నిజంగా అనుభవించినది లేనిది రహస్యముగానే ఉండిపోవును.
Epilogue (ఉపసంహారము):
ఇప్పుడు రెనే మాగ్రిట్ వేసిన దిగువన ఉన్న key to the fields (La clef des champs క్షేత్రమునకు మార్గము) పేరుతో ఉన్న పెయింటింగ్ను శ్రద్ధగా చూడమని పాఠకులకు అభ్యర్థన.
ఆ విరిగిన ముక్కలను గమనించిన, గాజు పగలక ముందు, మనం క్షేత్రము యొక్క పెయింట్ చేసిన చిత్రాన్ని మాత్రమే ప్రేక్షకుడు చూస్తున్నాడు అని తెలియ వచ్చును. నిజమైన ‘క్షేత్రము'ను కాదు అని యిట్టే తెలియును. గాజు పగిలిన తర్వాత, అతడు నిజమైన ‘క్షేత్రము'ను చుడగలుగుతున్నాడు.
అంటే, ఆ గాజు తెర మన అంతఃకరణము అన్నమాట. అందుకే అన్ని మత గ్రంథములలో అంతఃకరణ శుద్ధికి అంత ప్రాముఖ్యతనిచ్చారు. మనిషి తాను చూచునది సత్యమని భావిస్తాడు. కానీ తన చూపులను ప్రభావితము చేయుచున్న వాటిని గ్రహించుట దుష్కరము.
ప్రతీ అనుభవము మన మనస్సులో ఏదోవొక జాడను వదులుతుంది. ఇటువంటివి అనేకము కలసి తెలివిలోనికి వచ్చు సమాచారమును ‘వాతావరణములోని ధూళికణములు సూర్యుకాంతిని చెదిరి పోయేటట్లు చేయునట్లు’ సవరించును. కావున మనకు అనుభవములోనికి వచ్చు దర్శనము (picture) సత్యమునకు దూరముగా ఉండును. దీనినే పెయింట్ చేసిన చిత్రాన్ని మాత్రమే చూచుదుమని మాగ్రిట్టె గారు తెలిపిరి.
జిడ్డు కృష్ణమూర్తి గారి ఈ ప్రకటనను పరిశీలించండి. "మనస్సు నిశ్చలంగా ఉన్నప్పుడు మాత్రమే, ఏ విషయాన్ని ఆశించడమో, గ్రహించడమో లేదా ప్రతిఘటించడమో లేనప్పుడే, ఏది నిజమో చూడడం సాధ్యమవుతుంది. విముక్తి కలిగించేది సత్యమేగాని, స్వేచ్ఛగా ఉండటానికి మీ ప్రయత్నం కాదు."
ఇహము పరము కలిగించు వాడు శ్రీవేంకటేశుఁడు.
అనగా తనకున్నవన్నీ విడిచి శరణాగతి చేయుటయే మానవునికి గల ఏకైక వుపాయము.
శరణాగతులకు సత్యముగా వుండు వాడితడొకడే శ్రీవేంకటేశుఁడు.
గాజును పగలగొట్టినవాడు చేస్తున్న పనిలో లీనమై గాజు ఎలా పగిలిదీ గమనించలేదని తెలుస్తోంది. అతనికి త్వరిత గతిని గాజును ఛేదించుకు పోవాలన్న తపన ప్రస్ఫుటం. ఈవల నిలబడి వున్న మనిషిని రక్షించడమే అతని ఆసక్తి . భగవంతునికి మనపై అంతటి అవ్యాజమైన ప్రేమ.
సత్యానికి క్రమబద్ధమైన మార్గం లేదు.
అనియమిత మరియు ప్రమాదయుక్తమైన
మార్గం చిందరవందర ప్రపంచంయొక్క నైజమును చూపుతోంది. గాయాలకు భయపడి మనం గాజు గోడను దాటకపోతే
అంతకంటే పిరికితనముండదు.
x-x-x-x