తాళ్ళపాక అన్నమాచార్యులు
247 బయ లీఁదించీ నదివో ప్రాణులను హరిమాయ
For English version press here
ఉపోద్ఘాతము
కృతిరస విశ్లేషణ:
ఈ కీర్తనను ముఖ్యంగా ఒక ధ్వని కావ్యంగా (సూచక కవిత్వంగా)
పరిగణించవచ్చు — ఎందుకంటే ఇందులోని భావాలను ఎక్కడా నేరుగా ప్రకటించలేదు;
ఎదో తెలుపలేని విషయము లక్ష్యముగా అన్నీ సూచనల రూపంలోనే వున్నాయి. ఈ రచన
యొక్క నేపథ్యపు భావం స్పష్టంగా అధివాస్తవికము మరియు అలౌకికము అనవచ్చును.
ఈ
కీర్తనలో ప్రబలంగా కనిపించే స్థాయి భావం వైరాగ్యమేనని తీసుకుంటే,
దాని ద్వారా ఆవిష్కృతమయ్యే రసము — శాంతరసం. అదొక లోతైన జలముల లోనికి
ప్రయాణం.
ఇందులో
"హాస్యము" మోదమును పుట్టించక పోగా, కొంత ఎబ్బెట్టుగా వుండి, అది ఒక పరాయి రసంగా (అంగిరసంగా) వాలిన కనుబొమ్మలను కదిలించేలా, మూసుకుపోయిన ఆలోచనలకు అది వింతగా, ఊహించని రీతిలో మనల్ని
తట్టి ఆలోచింపజేస్తుంది.
సాహిత్యమును
అర్ధము చేసుకొనుట కష్ట సాధ్యము కనుక ఈ కీర్తనను ‘నారికేళ పాకము’గా భావించ వలెను. లోపలి
మాధుర్యాన్ని ఆస్వాదించాలంటే, ముందు దాని బాహ్యమైన ఒక పట్టాన
విడని పొరలను తొలగించాలి. అలా తెరిచాక – ఆ మాధుర్యం ఎంతోకాలం మనసులో నిలిచిపోతుంది.
అధ్యాత్మ సంకీర్తన |
రేకు: 251-4 సంపుటము: 3-293 |
బయ లీఁదించీ నదివో ప్రాణులను
హరిమాయ
క్రియ దెలుసుకొనేటి కీలింతే
కాని ॥పల్లవి॥ పెక్కుపరుషులలోన బెరశొకసతి
యుంటే
యిక్కువై యందే నాఁటు నిందరిచూపు
దక్కి యందరి కాఁగిళ్ల తరుణి
యుండుట లేదు
గక్కన వట్టియాసలఁ గరఁగుటే
కాని ॥బయ॥ చింతకాయ కజ్జాయము చేరి యిసుమంతవుంటే
అంతటనే నోరూరు నందరికిని
పొంతనే నాలుకలకు పులుసై యుండుటే
లేదు
కొంత భావించి మింగేటి గుటుకలే
కాని ॥బయ॥ శ్రీవేంకటేశుతేరు దీసేటి
మనుజులెల్లాను
సేవగా నేమే తీసితిమందురు
ఆవల నాతఁడే తమ అంతరాత్మయైయుండి
కావించుట యెరఁగరు గర్వములే
కాని ॥బయ॥
|
Details and Explanations:
పల్లవి:
Telugu
Phrase |
Meaning |
బయ లీఁదించీ
నదివో ప్రాణులను హరిమాయ |
దిగో కనబడటంలేదా!
హరిమాయ మనలను బయట బయటే ఈదించును. |
క్రియ దెలుసుకొనేటి కీలింతే కాని |
మానవుడు
చేపట్టదగు కార్యము తెలియుదాకా, ఇది ఇంతే.
కొనసాగుతుంది. |
ప్రత్యక్ష భావము:
వ్యాఖ్యానం:
పల్లవి ప్రధాన ఉద్దేశం —
మనిషి “అసలు చర్య” తెలియక తడబడతాడని.
కాని ఈ కవి — అది ఏమిటో చెప్పరు.
కేవలం… సూచిస్తారు.
ఇలాంటి
కవిత్వం ఎందుకు?
ఇంత సున్నితమైన భావాన్ని పొదిగే ప్రత్యామ్నాయం ఏది?
ప్రధానమైన
విషయం?
అది చెప్పకపోవడంలోనే ఉంది.
చెప్పినది ఒక జాలమైతే,
చెప్పనిదది ఆ జాలపు ఖాళి.
అసలు
సారాంశం —
చెప్పిన దానిలో కాక,
చెప్పనిదానిలో దాగి ఉంటుంది.
ఈ
రూపంలో —
కవి తన స్పష్టతను మౌనంగా పంచుతాడు.
ఉపదేశం లేదు, ఆకర్షణ లేదు —
కేవలం ఒక లోతైన దర్శనం.
నిగూఢ భావము:
నిగూఢ భావముపై వివరణ:
మొదటి చరణం:
పదబంధం |
అర్ధము |
పెక్కుపరుషులలోన
బెరశొకసతి యుంటే |
(బెరశొకసతి = వెరసి ఒక సతి = లెక్కకి ఒక స్త్రీ) అనేక మంది పురుషుల మధ్య ఒక స్త్రీ మాత్రమే ఉన్న |
యిక్కువై
యందే నాఁటు నిందరిచూపు |
అందరి చూపూ ఆమెపై ఉంటుంది |
దక్కి
యందరి కాఁగిళ్ల తరుణి యుండుట లేదు |
అయితే ఆమె అందరికీ దక్కుటలేదు |
గక్కన
వట్టియాసలఁ గరఁగుటే కాని |
కానీ అందరూ తమకే ఆ అవకాశం దొరుకుతుందన్న వట్టి ఆశలలో
కరిగిపోతూ వుంటారు |
ప్రత్యక్ష భావము:
వ్యాఖ్యానం:
రెండవ చరణం:
పదబంధం (Phrase) |
అర్థం (Telugu) |
చింతకాయ
కజ్జాయము చేరి యిసుమంతవుంటే |
(కజ్జాయము = కజ్జికాయ) చింతకాయ
కజ్జాయము అన్నమయ్య కాలములోప్రసిద్ది చెంది వుండ వచ్చును చింతకాయతో
చేసిన కజ్జాయమును కొంచెం ఉంచితే |
అంతటనే
నోరూరు నందరికిని |
అందరి
నోరులో నీరూరుతుంది |
పొంతనే
నాలుకలకు పులుసై యుండుటే లేదు |
కొంచెమే
వుంది కాబట్టి అందరికి పంచడానికి రాదు. అందరి నాలుకలకు ఆ పులుపు తగులుటలేదు |
కొంత భావించి
మింగేటి గుటుకలే కాని |
తినబోతున్నమనే
ఊహ వల్లనే మన నాలుక స్పందిస్తుంది |
ప్రత్యక్ష భావము
వ్యాఖ్యానం:
చింతకాయ కజ్జాయము —
ఒక బాహ్య అయస్కాంతం.
మన ఆశలు, ఊహలు —
మనలో దాగి ఉన్న ఇనుప సూదులు.
వాటిని తిప్పే శక్తి — అయస్కాంతానిదే.
మనకు తెలియకుండానే — మనసుపై ప్రభావం చూపుతుంది.
ఇది కేవలం ఊహ కాదు — శాస్త్రీయంగా నిరూపితమైన విషయం.
రష్యన్ శాస్త్రవేత్త పావ్లోవ్ చేసిన ప్రసిద్ధ ప్రయోగాన్ని గుర్తు
చేసుకోండి
ప్రతి సారి కుక్కలకు ఆహారం ఇచ్చే ముందు —
ఒక గంట మోగించేవాడు.
కొన్ని రోజులకు —
గంట మాత్రమే మోగితే చాలు,
ఆహారం లేకున్నా — కుక్కలకు నోరూరేది.
ఇది క్లాసికల్ కన్డిషనింగ్.
మన మనసూ అచ్చంగా అలాగే పనిచేస్తుంది.
చింతకాయ కజ్జాయము చూపించగా —
అది నోట్లోకి రాలేదు.
కానీ నోరూరుతుంది.
ఎందుకంటే మన ఊహలు, ఆశలు —
మునుపటి అనుభవాల జాడలు వదలిన సంజ్ఞలకు స్పందిస్తాయి.
అవి లోపల ఓ వాతావరణాన్ని నిర్మిస్తాయి.
ఇప్పటి దృశ్యం ఆ సంకేతాన్ని మేల్కొలుపుతుంది..
ఇలా
—
బయటి దృశ్యం ఒక సంకేతం లాగ
—
లోపల మేల్కొనేవి అనేక స్పందనలు.
ఈ
కోణంలో చూస్తే —
“కొంత భావించి మింగేటి గుటుకలే కాని”
అన్న
మృదుమైన పంక్తి వాస్తవం కాదని తెలిసినా
ఊహలో పుట్టిన ఆనందం ఎంత నిజమైన
అనుభూతిగా అనిపించగలదో
తెలిపే ఆత్మవేదన అవుతుంది.
మూడవ చరణం:
Telugu Phrase |
Meaning |
శ్రీవేంకటేశుతేరు
దీసేటి మనుజులెల్లాను |
శ్రీవేంకటేశుని రథాన్ని లాగే ప్రజలంతా |
సేవగా
నేమే తీసితిమందురు |
"ఈ కృషి మాదే" అని హర్షంతో
చెప్పుకుంటారు |
ఆవల నాతఁడే
తమ అంతరాత్మయైయుండి |
కానీ శ్రీవేంకటేశుడే వారిలో అంతరాత్మగా ఉండి |
కావించుట యెరఁగరు గర్వములే కాని |
తామే చేసితిమన్న గర్వము కారణం కాగా వారు గుర్తించలేకపోతారు |
ప్రత్యక్ష భావము
ఉపసంహారము & కీర్తన సారాంశం:
మనిషి
బహిరంగంగానే కర్మ అనే ఊబిలోకి దిగుతాడు
ఇది
"కండిషనింగ్" అనే ఆంతరంగిక ప్రక్రియపై
అన్నమాచార్యులు
పలికిన సున్నితమైన, గొప్ప వాస్తవము.
మొదటి
చరణం —
మన
చర్యల వెనుక ఉన్న ఊహాజనిత తపనను ఎత్తి చూపిస్తారు.
రెండవ
చరణం —
ఆ
తపన ఎలా అలవాట్లుగా, అనుభవాలుగా మనల్ని ఆక్రమిస్తుందో
తెలుపుతుంది.
చివరగా
—
అసలు
మర్మాన్ని మన ముందుంచుతుంది:
మనమే
కారణమని మదించ రాదు.
మనం
కర్తలము కాదని,
ఆయన
చేతిలోని సాధనాలమని స్పష్టతనిచ్చే అద్భుత ముగింపు.
అంత్యమే కాని అల్పము కాదు
నేను ఎంత పైకెక్కినా —
అక్కడకి నా కన్నా ముందే
ఒక కవి చేరుకొని ఉంటాడు.”
— సిగ్మండ్ ఫ్రాయిడ్
X-X-The
END-X-X
No comments:
Post a Comment