తాళ్ళపాక అన్నమాచార్యులు
254 మరుని నగరిదండ మా యిల్లెఱఁగవా
ఉపోద్ఘాతము
ఈ కీర్తన సాధకునికి ధైర్యం నింపుతుంది — ప్రతి పదమూ వాస్తవ పరిస్థితిని కళ్లముందు ఒక అద్దంలా నిలబెట్టి: “ఇదే నీ నిజమైన ఇల్లు, నీ అసలు పరిస్థితి — దాన్ని గుర్తించు” అని ఉద్బోధిస్తుంది.
మరువలేని ఉపమానాలు ఇక్కడ ఆవిష్కరించబడ్డాయి — “మార్గాన్ని మూసివుంచె బంగారు కొండలు”, “చెదరియు జెదరని చిమ్మఁ జీఁకటి”, “మఱపు–దెలివి”, “ఉమ్మెత్తల తోటలు”, “మరుముద్రల వాకిలి”. ఇవి కేవలం కవితాత్మక అలంకారాలు కావు; మనసు ఎలా విషయములలో చిక్కుకుంటుందో వెలికితీసే ఆవిష్కరణలు.
ఈ కీర్తన బలం — ఇది సాధకుణ్ణి నేరుగా తన పరిస్థితిని ఎదుర్కొనమని పిలుస్తుంది. మానవ బలహీనతలను నిజంగా ఉన్నట్టుగా చూడమని సూచిస్తుంది. అలాంటి నిర్మల దర్శనంలోనే, అన్నమాచార్యులు చెబుతున్నట్టు, సత్యానికి, దైవానికి దారి కనబడుతుంది.
శృంగార సంకీర్తన |
రేకు: 75-4 సంపుటము: 5-262 |
మరుని నగరిదండ మా యిల్లెఱఁగవా
విరుల తావులు వెల్లవిరిసేటి
చోటు ॥పల్లవి॥ మఱఁగు మూఁక చింతల మాయిల్లెఱఁగవా
గుఱుతైన బంగారుకొండల సంది
మఱపు దెలివి యిక్క మాయిల్లెఱఁగవా
వెఱవక మదనుఁడు వేఁటాడేచోటు ॥మరు॥ మదనుని వేదంత మాయిల్లెఱఁగవా
చెదరియు జెదరని చిమ్మఁ జీఁకటి
మదిలోన నీవుండేటి మాయిల్లెఱఁగవా
కొదలేక మమతలు కొలువుండేచోటు ॥మరు॥ మరులుమ్మెతల తోఁట మాయిల్లెఱఁగవా
తిరువేంకటగిరిదేవుఁడ నీవు
మరుముద్రల వాకిలి మాయిల్లెఱఁగవా
నిరతము నీ సిరులు నించేటిచోటు ॥మరు॥
|
Details and Explanations:
Telugu
Phrase |
Meaning |
మరుని
నగరిదండ |
మన్మథుని
(కామ దేవుని) పట్టణపు ప్రాపుతో నిలబడి వున్నది |
మా
యిల్లెఱఁగవా |
మా ఇల్లు
ఎటువంటి స్థలమో నీవెరగవా? |
విరుల
తావులు వెల్లవిరిసేటి చోటు |
వాంఛల
పువ్వులు విరివిగా వికసించే స్థలం |
సూటి భావము:
"ఓ వేంకటేశా! నా ఇంటి చుట్టూ మన్మథుని పట్టణం దండలా చుట్టుకొని వుంది. అక్కడ వాంఛల పువ్వులు విరివిగా విరబూస్తున్నాయి. ఈ నా స్థితి నీకు తెలియనిదా?"
గూఢార్థవివరణము:
అన్నమాచార్యులు ఇక్కడ ఒక విలక్షణమైన రూపకం చూపించారు. మన అసలు ఇంటికి (జీవితానికి) దారి ఏ వైపు నుంచి వెళ్ళినా మన్మథుని పట్టణాన్ని దాటుకునే వుంది. అన్నమాచార్యుల ప్రత్యేకత ఏమిటంటే, ఆయన దీనిని అలంకారంగా కాకుండా సత్యానికి ప్రతిబింబంగా చెప్పారు. ఈ మొదటి పాదంలోనే ఆయన కోరికల వృక్షాన్ని (భగవద్గీత 15వ అధ్యాయంలో చెప్పిన వృక్ష రూపకం) సూటిగా మన కళ్లముందు ఉంచారు.
దానిని
దాటుటెట్లు? దాదాపు అసంభవం. దీనిపై అన్నమాచార్యులు, జిడ్డు కృష్ణమూర్తి గారు భగవద్గీత నుంచి కొంత వేరుగా మరింత సుసాధ్యముగా ఎలా చెప్పినారో క్రింది పట్టిక
నుంచి తెలియవచ్చును.
భగవద్గీత, అన్నమాచార్యులు, జిడ్డు కృష్ణమూర్తి —
వృక్ష/మనస్సు బింబం |
|||
అంశం |
భగవద్గీత (15:1–3) |
అన్నమాచార్యులు |
జిడ్డు కృష్ణమూర్తి |
ఉపమానం |
ఒక మహావృక్షం (అశ్వత్తం) — వేర్లు పైకి, కొమ్మలు క్రిందికి |
ఒక ఇల్లు (మనస్సు) — మమకారం, మాయ, మరుపు, గందరగోళంతో
నిండినది |
“షరతుపడిన మనస్సు” — జ్ఞాపకాలు, సంప్రదాయం, ఆలోచనలతో నిండి ఉన్నది |
సమస్య |
ఆ వృక్షానికి అనాది నుంచి బలమైన వేర్లు ఉన్నాయి; మానవుని కట్టిపడేస్తాయి |
గందరగోళంలో మనిషి తాంబూలం బదులు మాణిక్యం ఇస్తాడు; మనస్సు విషపూరిత బంధనాలతో నిండినది |
చరిత్ర, జ్ఞాపకం, ఆలోచన
— ఇవన్నీ మనస్సుని చీకటిలోనే ఉంచుతాయి |
పరిష్కారం |
“వైరాగ్యఖడ్గంతో దాన్ని నరికివేయాలి.” |
గందరగోళాన్ని చూడాలి, అంగీకరించాలి; అప్పుడు భగవద్గ్రహంతో మనస్సు సహజంగా
క్రమబద్ధమౌతుంది. పరోక్షంగా ఏ విధానాలు అవసరం లేదన్నారు. |
ఆలోచన ఆగినపుడు సహజ క్రమం వికసిస్తుంది; ఎలాంటి విధానాలు అవసరం లేదు |
ప్రాయోగికత |
లోతైన సిద్ధాంతం కానీ సాధారణ జీవనానికి దూరంగా ఉంది |
భక్తి ఆధారంగా, అనుభవాల ద్వారా నేల మీద నిలబెట్టిన సత్యం |
వెంటనే అనుసరించదగినది — ‘ఎంపిక లేని పరిశీలన’ ద్వారా
సాధ్యమని చెబుతాడు |
మూల సందేశం |
“విరక్తితో నరికివేయాలి.” |
“చూడాలి — అంగీకరించాలి — అప్పుడు క్రమం సహజంగా వస్తుంది.” |
“ఎంచుకోకుండా పరిశీలించాలి — క్రమం సహజంగా వికసిస్తుంది.” |
సాధ్యత |
వాస్తవానికి ఏ జీవి ఈ బంధాన్ని పూర్తిగా నరికివేయలేడు |
దాదాపు అసాధ్యం అయినా, భక్తి ద్వారా క్రమబద్ధత సాధ్యమని చూపించారు |
దాదాపు అసాధ్యం అయినా, లోతైన అవగాహనతో అది సాధ్యమే అని ఆయన నొక్కి చెబుతాడు |
మొదటి చరణం:
Telugu
Phrase |
Meaning
in Telugu |
మఱఁగు
మూఁక చింతల మాయిల్లెఱఁగవా |
వెనక నుండి (ప్రచ్ఛన్నముగా) వేదనను కలిగించు సేన మేముండు
ప్రదేశము. |
గుఱుతైన
బంగారుకొండల సంది |
గుర్తు పట్టగల రెండు బంగారంలాగ ధగధగా మెరిసే కొండల మధ్య చొరబడుటకు సాధ్యముకాని
స్థలము మా ఇల్లు. |
మఱపు దెలివి
యిక్క మాయిల్లెఱఁగవా |
జ్ఞాపకాల మీద ఆధారపడిన తెలివితో ఆ సంకేత స్థలములో
వున్న మా గృహము తెలియగలవా? |
వెఱవక
మదనుఁడు వేఁటాడేచోటు |
అక్కడ మన్మథుడు స్వేచ్ఛగా విహరిస్తూ మమ్మల్ని వేటాడుతుంటాడు |
సూటి భావము:
దేవుడా!
మేముండు ప్రదేశము వెనక నుండి (ప్రచ్ఛన్నముగా) వేదనను,
ఇరకాటమును కలిగించు సేన వంటిది. అదిగో గుర్తు పట్టగల రెండు బంగారంలాగ ధగధగా మెరిసే కొండల మధ్య చొరబడుటకు సాధ్యముకాని
స్థలమున మా ఇల్లు వున్నదంట. జ్ఞాపకాల మీద ఆధారపడిన తెలివితో ఆ సంకేత స్థలములో వున్న
మా గృహము తెలియగలమా? అంతేకాదు అక్కడ మన్మథుడు స్వేచ్ఛగా విహరిస్తూ
మమ్మల్ని వేటాడుతుంటాడు.
గూఢార్థవివరణము:
గుఱుతైన బంగారుకొండల సంది:
రెండు బంగారు కొండలు. ఒకటి సంపద, ధనము, పేరు, ప్రఖ్యాతి వంటి వ్వవహారములు. ఇవి కొలువఁగలిగినవి, లెక్కకు అందునట్టివి. కావున వీటిని చేబట్టుటకు మానవాళి సహజంగానే ఆసక్తి చూపును.
ఇంకొకటి సంపద, కుటుంబము, ఇల్లు, ఆహారము, ప్రాణము మొదలగునవన్నీ త్యాగము చేసి, తెలియలేని ఆ దైవమును పొందుటకు చేయు ప్రయాసములు - దైవారాధనము, తపస్సులు. ఇవి కూడా మొదటివాటికంటే ఉన్నతమైనవి అన్న భావాన్ని కలిగించి, మనసును ఆకర్షిస్తాయి.
ఈ రెండు బంగారు కొండలు ఒకదానితో ఒకటి పోటీపడుతూ మనిషిని తమ వైపుకు లాగుతాయి. ఫలితంగా ఆ రెండు మధ్యన నలిగిపోయిన మనస్సుకు శ్వాస కూడా కరువౌతుంది. ఇక ఆ గుఱుతైన బంగారుకొండల మధ్యనున్న సంది — అంతరంగానికి దారి — కనపడదు. చెప్పినా ఆలకించలేరు.
“గుఱుతైన బంగారుకొండల సంది” అనేది బైబిల్ చెప్పిన “ఇరుకు దారి” (narrow gate) వంటిదే — రెండు
మెరుస్తున్న ఉచ్చుల మధ్య దాగి వున్న మార్గము: రెండూ మెరుస్తున్నా నిజమైన దారి వాటిలో
వుండదు; వాని మధ్యలో కనబడని కురుచ త్రోవ.
మఱపు దెలివి:
జ్ఞాపకాల
మీద ఆధారపడిన తెలివితో మనము వివేకవంతలమని చెప్పుకోబోతాం. ఈ రకమైన సంప్రదాయ జ్ఞానము
లోనికి సత్యము చొరబడుటకు అడ్డు తగులుతుంది.
ఈ విషయమును రహస్యోద్ఘాటన “Revelation (The Clockmaker)” అను
పేరుగల రెమెడియోస్ వారొ అను చిత్రకారిణి వేసిన
అధివాస్తవిక చిత్రమును పరిశీలించుచు తెలుసుకొందాము.
ఈ బొమ్మలో ఒక గుడారములోని పైకప్పు నేలకి ఒరిగిపోకుండా గడియారం స్తంభాలు పెట్టి దానిని క్రిందికి రాకుండా ప్రయత్నం చేస్తున్నట్లు కనబడుతుంది. ఆ గడియారం స్తంభాలలో ఒక్కోదానిలో ఒక్కోకాలపు ప్రతిమలను పెట్టి చారిత్రికంగా మానవుని యత్నాలు ఒకే మాదిరిగా వున్నట్లు తెలుస్తోంది.
క్రింద నున్న గళ్ళు వేసిన నేల సహజము కాని దాన్ని చూపుతున్నది. క్రింద పడుతున్న పైకప్పు మన మనస్సు. దానిని మన మెమొరీలో రికార్డు చేయబడ్ద చరిత్ర అనే స్తంబాలు పడిపోకుండా ఆపుతున్నవి. ఇదంతా సమగతిని సమయము పోవునది సూచిస్తున్నవి. మన తెలివి (అవేర్'నెస్) ఆ గుడారము వంటిది.
ఆ గదికి కిటికీ వున్నది కానీ మాసేసి వున్నదన్న సూచనగా నలుపు రంగుతో చూపారు. ఆ గదిలోని ప్రకాశమంతా అందలి వస్తువులదే. ఆ గదిలో ఒక యువతి కూర్చొని అది ఏదో తనపని అన్నట్లుగా ఆ గడియారపు స్తంభాలకు విడి భాగాలు (పళ్ళ చక్రాలు) తయారుచెస్తున్నది (అదే సమయంలో తనకేమీ సంబంధము లేదన్నట్లుగా కూడా అమె భంగిమ చెబుతున్నది). అక్కడ కూర్చొన్న పిల్లి ఆ ఉదంతమంతా, తనేమీ పాలుపంచుకోకుండా చూస్తున్నది.
ఆ ప్రక్కనే ఏమో తెలియని తిరుగుతున్న చక్రము వంటిది సగము గుడారములోను సగము బయట వుంచి అసలు కాంతిని పాక్షికముగానే లోపలికి వస్తున్నదని చెబుతున్నది. ఆ గదిలోని ప్రకాశముతో పోల్చితే ఆ చక్రము కాంతి చాలా తక్కువ అని చెప్పవచ్చును.
మనిషి గుడారము
పడిపోకుండా చేయు పనులు ఆ స్తంబాల వంటివి. మనిషి ఆందోళన అంతా ఆ స్తంబాలు పడిపోతే ఏమౌతుందోననే.
మనిషి చేబట్టు పనులన్నీ - చరిత్రను, సంస్కృతిని, నాగరికతను
నిలబెట్టి వుంచడం, తాను నమ్మిన దైవమునకు ప్రతీకలను ప్రాణాలొడ్డి
రక్షించడం, పాత జ్ఞాపకాలను దాచుకోవడం వంటివి ఈ కోవలోనివే. ఇవి
ఇక్కడ అన్నమాచార్యులు పేర్కొన్న మఱపు దెలివిలోని భాగములే.
రెండవ చరణం:
Telugu
phrase |
Meaning
in Telugu |
మదనుని వేదంత మాయిల్లెఱఁగవా |
మా ఇంట్లో మదనుని తత్వవిచారము ఆటాడుతుందయ్యా! (దెయ్యాలు వేదాలు
వల్లించినట్లు అన్నమాట) |
చెదరియు జెదరని చిమ్మఁ జీఁకటి |
చెదరగొట్టినా చెదిరిపోని చిమ్మఁ జీఁకటి |
మదిలోన నీవుండేటి మాయిల్లెఱఁగవా |
మా మనసులలో నీ వుండే మా ఇంటిగుట్టు నీకు ఎరుకలేదా? (వ్యంగ్యం) |
కొదలేక మమతలు కొలువుండేచోటు |
కొదువలేని మమతల రాజాశ్రయము. ఉద్యోగ స్థానము. |
సూటి భావము:
శ్రీవేంకటేశుడా! మా ఇంట్లో మదనుని తత్వవిచారము ఆటాడుతుందయ్యా! (దెయ్యాలు వేదాలు వల్లించినట్లు అన్నమాట) చెదరగొట్టినా చెదిరిపోని చిమ్మఁ జీఁకటి మా నివాసం. మా మనసులలో నీ వుంటే మా ఇంటిగుట్టు నీకు ఎరుకలేదా? అది కొదువలేని మమతల రాజాశ్రయము. ఉద్యోగ స్థానము.
గూఢార్థవివరణము:
మదనుని వేదాంతము: ఇక్కడ అన్నమాచార్యులు వ్యంగ్యాన్ని ఉపయోగించారు. కోరిక (కామము) తానే ఒక గురువుగా మారింది. మదనుని వేదాంతము అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు అన్నమాట. ఇచ్చే ఆ శాస్త్రము విముక్తి బదులు వాంఛను తర్కపూర్వకంగా న్యాయపరచును.
చెదరియు జెదరని చిమ్మఁ జీకటి: ఆ అజ్ఞానం ఒక క్షణికంగా అలముకున్న మేఘం కాదు. స్థిరముగా పీడించునది. ఒకవేళ గురువుల బోధతో గాని, స్వయంగా తెలుసుకున్న ప్రజ్ఞతో గానీ కాస్త పక్కకు తప్పించినా, అది మళ్లీ తిరిగి ఆక్రమించుకొనును. ఇది మన సాధారణ మనస్సు యొక్క స్వరూపం: సత్యాన్ని వింటాము, అంగీకరిస్తాము, కానీ ఆచరణలోకి లేదా రూపాంతరంలోకి రాదు. దీనికి అనేక సారూప్యాలు ఉన్నాయి (వాటి కోసం క్రింద పట్టిక చూడండి).
సంప్రదాయం |
వాక్యం/ఆలోచన |
అన్నమాచార్యుని పోలిక |
బుద్ధుడు |
“పస్స పచ్ఛయా వేదన” — అనుభవం ఆధారమై పుడుతుంది; అది అంతర్గత కారణాల వలన తిరిగి వస్తూనే ఉంటుంది |
చీకటి తాత్కాలికంగా తొలగినట్టనిపించినా, లోతైన అంధకారము మిగిలియే వుండును |
యేసు (బైబిల్) |
“They have eyes, but they do not see; ears, but they do not
hear.” గనుక మీరు వినుటమట్టుకు విందురుగాని గ్రహింపనే గ్రహంపరు, చూచుటమట్టుకు చూతురుగాని యెంత మాత్రమును
తెలిసికొనరు (మత్తయి 13:13) |
అర్థమైందనుకునే మాయ — కానీ నిజజ్ఞానం వెలగదు |
భగవద్గీత (5.15) |
అజ్ఞానేనావృతం జ్ఞానం — జ్ఞానం అజ్ఞానంతో కప్పబడి ఉంది |
చీకటి చెదిరినట్టనిపించినా మాయ కప్పి ఉంచుతుంది |
జిడ్డు కృష్ణమూర్తి |
“The seeing is never complete; memory interferes and says
‘I know’.” చూచూట (దృష్టి) ఎప్పుడూ సంపూర్ణం కాదు; జ్ఞాపకాలు మధ్యలో అడ్డు వచ్చి — ‘నాకు తెలిసినదే’
అని ప్రక్కకు మళ్ళిస్తాయి.” |
అర్థం అయినట్టే కానీ అది గతస్మృతుల కప్పు మాత్రమే |
ఉపనిషత్తులు |
అన్ధం తమః ప్రవిశన్తి యేऽవిద్యాముపాసతే । — “అవిద్యవల్లా, అసత్యజ్ఞానమువల్లా,
అర్థంలేని యాంత్రిక కర్మాచరణవల్లా,
మేధోమయమైన జ్ఞానార్జనలో గాని మునిగి జీవులు చీకటిలోనే ఉంటారు.” |
“చిమ్మ జీకటి” — గాఢ అజ్ఞానం |
మహావీరుడు (జైనం) |
“మాయా మోహణీయ కర్మ” — మాయ మనసుకు స్పష్టత వచ్చినట్టు మోసం
చేస్తుంది |
చెదరినట్టే కానీ నిజానికి జీకటి మిగిలే ఉంది |
మదిలోన నీవుండేటి: ఇక్కడ అన్నమాచార్యులు ఒక సంచలనమైన సత్యాన్ని చెబుతున్నారు — భగవంతుడు మన హృదయంలోనే నివసిస్తున్నాడు. కానీ ఆ సన్నిధి మానసిక అడ్డంకులతో పూర్తిగా కప్పబడిపోయింది.
కొదలేక
మమతలు కొలువుండేచోటు: మమకారాలు, బంధుత్వాలు, ఆస్తుల గర్వం — ఇవి తొలగిపోవు. అవి ఒక
రాజదర్బారులో మంత్రుల్లా సింహాసనం ఎక్కి కూర్చొని, మన
జీవనంలోని ప్రతి కదలికను నియంత్రిస్తాయి.
మూడవ చరణం:
తెలుగు పదబంధము |
అర్థము |
మరులుమ్మెతల తోఁట మాయిల్లెఱఁగవా |
“మోహము ఉమ్మెత్తల తోట — బయటకి ఆకర్షణీయంగా
కనిపించే కానీ లోపల విషపూరితమైన వాంఛల తోట” అని తెలియదా
నీకు? |
తిరువేంకటగిరిదేవుడు |
వేంకటగిరి నాథుడు, శ్రీ వేంకటేశుడు |
మరుముద్రల వాకిలి మాయిల్లెఱఁగవా |
మా ఇంటి ద్వారము అనేకానేక కోరికలు అను లంకెలతో మూసివేసిన తలుపు
— ప్రవేశం అసాధ్యము |
నిరతము నీ సిరులు నించేటిచోటు |
అయినా, ఆ ఇంటిలోనే నీ దివ్యసంపదలు
నిత్యం వెల్లివిరుస్తూనే ఉంటాయి |
సూటి భావము:
“ఓ వేంకటేశా! నా ఇల్లు ఒక ఉమ్మెత్తల తోట వంటిది — వెలుపల చూడడానికి పువ్వులు ఆకర్షణీయంగా ఉంటాయి, కానీ లోపల విషం. ఇంటి వాకిలి మీద అనేక ముద్రలు వేసి మూసివేశారు. లోపల మాత్రం మమకారం, ఆస్తి, అహంకారం నిండివున్నాయి. అయినా, ఆశ్చర్యంగా, ఈ స్థలంలోనే నీ దివ్యసంపదలు వెల్లివిరుస్తూనే ఉన్నాయి. ఈ నా స్థితి నీకు తెలియనిదా?”
గూఢార్థవివరణము:
మరులుమ్మెతల
తోఁట: మన కోరికలు ఉమ్మెత్త పువ్వుల వంటివి — బయటకి
మధురంగా అనిపిస్తాయి కానీ లోపల విషపూరితం. ఈ రూపకం ద్వారా అన్నమాచార్యులు మనసు
యొక్క మోసపూరిత స్వభావాన్ని చూపుతున్నారు.
మరుముద్రల
వాకిలి: మన వాంఛలు, మోహాలు,
మమకారాలు మన హృదయ ద్వారాన్ని అనేక ముద్రలతో మూసేస్తాయి. ఇది గీత (16.16)
లోని “అనేకచిత్త విభ్రాంతా మోహజాల సమావృతా” కి సమానం.
నిరతము
నీ సిరులు: అన్నమయ్య ఇక్కడ కీలకమైన ఆవిష్కరణ
చేస్తారు. ఈ స్థితి ఎంత దారుణమైనదైనా, మనసు ఎంత
కలుషితమైనదైనా, దేవుని కృప ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. మన
కర్తవ్యమేమిటంటే — నిరంతరము దేవుని మీద ధ్యాసను నిలుపుకోవడం.
ఈ కీర్తన ముఖ్య సందేశం
అన్నమాచార్యుల
కీర్తనలు మానవునికి విస్తారమైన అవకాశాలను చూపిస్తాయి. పరిస్థితి ఎంత చెదిరిపోయినా, ఈ శరీరములోనే, మనలోనే, దైవకాంతి
ప్రసరించగలదు. చేయవలసినది ఒక్కటే — అన్ని పరధ్యానములను విడిచి, అచంచల భక్తితో, ఏకదీక్షతో, దేవుని
వైపు నిలకడగా నిలబడుట.
X-X-The
END-X-X
No comments:
Post a Comment