తాళ్లపాక అన్నమాచార్యులు
288 తనుఁ దా నేమఱక దైవము మఱవకుంటే
For English version
press here
నాడె
రీతి తిరుగాడు బ్రతుకు
ఉపోద్ఘాతము
కీర్తన సంక్షిప్త
చిత్రం
|
అధ్యాత్మ కీర్తన
|
|
రేకు: 293-6
సంపుటము: 3-541
|
|
తనుఁ దా నేమఱక దైవము మఱవకుంటే మనసులోనే కలుగు మహామహిమ ॥పల్లవి॥ కనురెప్ప మూసితేనే కడ దాఁగె జగమెల్ల కనుదెరచినంతనే కలిగెఁ దాను ననిచివుండుట లేదు నమ్మకపోవుట లేదు తనతోడిదే యిన్నిఁ దాఁ గలితేఁ గలవు ॥తనుఁ॥ కడుపు నిండినంతనే కైపాయ రుచులెల్లా బెడిదపు టాఁకలైతేఁ బ్రియమాయను యెడనెడఁ జేఁదు గాదు యింతలోనే తీపు గాదు వొడలితోడివే యివి వుండినట్టే వుండును ॥తనుఁ॥ అద్దములోఁ దననీడ అంతటా మెరసినట్లు పొద్దువొద్దు తనతోనే భోగాలెల్లా అద్దిన శ్రీవేంకటేశుఁ డంతరాత్మయైనవాఁడు కొద్ది లేదాతనిమాయ కొనసాగుచుండును॥తనుఁ॥
|
|
Telugu Phrase
|
Meaning
|
|
తనుఁ దా
నేమఱక దైవము మఱవకుంటే
|
అతి జాగరూకతతో
తనను తాను మరువక, అదే సమయములో దైవమును విడువక (ఉంటే)
|
|
మనసులోనే
కలుగు మహామహిమ
|
మనసులోనే కలుగును మహామహిమ
|
భావము: ఎవ్వడైతే అతి జాగరూకతతో తనను తాను మరువక, అదే సమయములో దైవమును విడువక ఉంటే, ఆతని మనసులో మహామహిమ కలుగును.
సాధారణంగా మనము శ్రద్ధ పెట్టినప్పుడు అచేతనావస్థ నుంచి చేతనావస్థకు చేరుతాము. చేతనలో మనం కేంద్రీకరించే విషయం స్పృహలోకి వస్తుంది. మరొక విషయంపై మనసు మార్చినప్పుడు మొదటి విషయం స్పృహ నుంచి తప్పి, రెండవదే పరిపూర్ణంగా నిలుస్తుంది. ఒకేసారి రెండు విషయాలపై మనసు కేంద్రీకరించటం అసాధ్యం. ఈ మానసిక పరిమితినే అన్నమాచార్యులు ప్రశ్నిస్తున్నరు.
ఇక్కడ ఆయన రెండు అసాధ్య స్థితులను ఒకే అక్షం మీద ఉంచుతున్నారు. సాధారణంగా మన అనుభవంలో “చూచువాడు” – “చూచినది” – “చూచుట” అనే మూడు భాగాలు ఉంటాయి. “చూచినది” మారితే, ఆ అక్షమే మారిపోతుంది. కానీ అక్షం మారకుండా చూసే స్థితికి “చూచువాడు”, “చూచినది” రెండూ కరిగిపోవాలి; మిగిలేది ‘చూచుట’ మాత్రమే.
“నేను” – “అది” అన్న విభజన నుండే ద్వంద్వం పుడుతుంది. ఆ విభజన కరిగితే ద్వంద్వం కూడా కరుగుతుంది. అప్పుడు మనలోని అంతర్గత ప్రకాశం తనంతటదే వెలుగుతుంది. అదియే మనసులోనే కలుగు మహామహిమ.
బుద్ధుడు
రెండవ వారము “అనిమేష లోచన”లో గడుపుతాడు. ఇది కూడా
అన్నమాచార్యులు చెప్పినటు వంటిదే. ఏ
మనసైతే "తాను" అన్న స్పృహనుండి "దైవము" అను స్పృహల మధ్య ఆడుటలేదో, అది
పూర్తిగా చూచుట అను యత్నము నుండి విముక్తియై సర్వమును గ్రహించుటకు అనుకూలమగును.
|
Telugu Phrase
|
Meaning
|
|
కనురెప్ప మూసితేనే కడ దాఁగె జగమెల్ల
|
(కనురెప్ప
మూసితేనే = మరణము) కనురెప్ప మూసితేనే ఏ దిక్కుననో దాగెను ఈ జగము.
|
|
కనుదెరచినంతనే కలిగెఁ దాను
|
(కనుదెరచినంతనే
= జననము) కనుదెరచినంతనే కలిగెను ఈ జగము.
|
|
ననిచివుండుట లేదు నమ్మకపోవుట లేదు
|
దీనిని నమ్మి వుండలేము. అట్లని నమ్మకపోవుట కూడా కష్టము
|
|
తనతోడిదే
యిన్నిఁ దాఁ గలితేఁ గలవు
|
ఆతని తోడివే
ఇవన్నీ. అతడుంటేనే వుండును.
|
భావము:
మరణముతో
ఏ దిక్కుననో దాగెను ఈ జగము. జననముతోనే కలిగెను
ఈ జగము. దీనిని నమ్మి వుండలేము. అట్లని నమ్మకపోవుట కూడా కష్టము. ఆతని తోడివే ఇవన్నీ. అతడుంటేనే వుండును.
గూఢార్థవివరణము:
|
Telugu Phrase
|
Meaning
|
|
కడుపు నిండినంతనే కైపాయ రుచులెల్లా
|
కడుపు నిండినంతనే రుచులెల్లా మైకము కమ్మినట్లనిపించు
|
|
బెడిదపు టాఁకలైతేఁ బ్రియమాయను
|
భయంకరమైన ఆకలియైతే అవియే ప్రియమగును
|
|
యెడనెడఁ జేఁదు గాదు యింతలోనే తీపు గాదు
|
మధ్యమధ్యన చేదు గాదు. ఇంతలోనే తీపీ కాదు
|
|
వొడలితోడివే యివి వుండినట్టే వుండును
|
శరీరపు వికారములు ఇవి. అలా మారుతూ వుంటాయి.
|
సూటి భావము:
కడుపు నిండినంతనే
రుచులెల్లా మైకము కమ్మినట్లనిపించును. భయంకరమైన ఆకలియైతే అవియే ప్రియమగును. మధ్యమధ్యన
చేదు గాదు. ఇంతలోనే తీపీ కాదు. శరీరపు వికారములు ఇవి. అలా మారుతూ వుంటాయి.
గూఢార్థవివరణము:
మూడవ చరణం:
|
Telugu Phrase
|
Meaning
|
|
అద్దములోఁ దననీడ అంతటా మెరసినట్లు
|
ప్రతిబింబములు ఎన్ని అద్దాలు ఉంటే అన్నింటిలోను అగపడినట్లు
|
|
పొద్దువొద్దు తనతోనే భోగాలెల్లా
|
పొద్దువొద్దు = పొద్దుపొద్దు = ప్రతీ జన్మములోను) నీవు సృష్టించుకున్న
వానితోనే నీ భోగములు
|
|
అద్దిన శ్రీవేంకటేశుఁ డంతరాత్మయైనవాఁడు
|
(అద్దిన = ఊహించుకొన్న, పైపైన
నిలుపుకున్న) పైపైన నిలుపుకున్న శ్రీవేంకటేశుఁ డంతరాత్మయైనవాఁడు
|
|
కొద్ది లేదాతనిమాయ కొనసాగుచుండును
|
తక్కువగా అంచనావేయకండి, అన్నిటా అతని మాయలే కొనసాగుచుండును
|
(అన్నమాచార్యులు అత్యంత తీక్షణమైన సంగతిని, అనగా మాయ యొక్క అంచులను చూచుట కష్టసాధ్యమని తెలుపుతున్నారు.) ప్రతిబింబములు ఎన్ని అద్దాలు ఉంటే అన్నింటిలోను అగపపడును. ప్రతీ జన్మములోను నీవు సృష్టించుకున్న వానితోనే నీ భోగములు. అంతే. పైపైన నిలుపుకున్న శ్రీవేంకటేశుఁ డంతరాత్మయైనవాఁడు. తక్కువగా అంచనావేయకండి, అన్నిటా అతని మాయలే కొనసాగుచుండును
ఈ కీర్తన
ముఖ్య సందేశం
X-X-The
END-X-X
చాలా బాగా చెప్పారు 🙏
ReplyDelete